AP Govt Employees Update:
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ సంబంధించి ఒక జీవో విడుదల చేయడం జరిగింది. 180 రోజుల ప్రసూతి సెలవులు ఇంతకుముందు కేవలం ఇద్దరు పిల్లలు వరకు మాత్రమే ఇచ్చేవారు ఇకనుండి ఎంతమంది పిల్లలు పుట్టిన ప్రసూతి సెలవులు 180 రోజులు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరిస్తూ జీవో నంబర్ 21 ను జారీ చేయడం జరిగింది.
ఇటువంటి AP Govt ఉద్యోగుల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥అన్నదాత సుఖీభవ 20 వేలు అప్డేట్
Maternity Leave For AP Govt Women Employees:
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకంలో ఎంతమంది పిల్లలు ఉన్నా వర్తిస్తుందని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే అలాగే ఎన్నికల్లో ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తూ జీవో జారీ చేశారు ప్రస్తుతం మహిళ ఉద్యోగులకు ప్రసూతి సెలవుల్లో అవకాశం కల్పించారు ఇందులో భాగంగా 180 రోజుల ప్రసూతి సెలవులు ఇకనుండి ఎంతమంది పిల్లలు ఉన్నా తీసుకుని అవకాశం ఉంటుంది.
రాష్ట్రంలో యువత మరియు దేశంలో యువ జనాభా తగ్గిపోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు. మహిళా ఉద్యోగులకు ఇది ఒక మంచి శుభ పరిణామం మహిళలకు ఇచ్చినట్టే మగవారి కూడా Paternity సెలవు ఇస్తారని త్వరలోనే వాటికి సంబంధించిన జీవో కూడా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సమాచారం పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP Govt Employees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్ జీవో విడుదల”