Annadata Sukhibhava Update:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ సంబంధించి ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది ఈ పథకం ద్వారా మొత్తం 47.77 లక్షల రైతులకు లబ్ధి చేకూరుస్తున్నారు. రైతు సేవా కేంద్రాల సర్వే ఆధారంగా ఇప్పటివరకు 98 శాతం మంది ఈ కేవైసీ పూర్తి చేసినట్లు ఇంకా 61 వేల మంది పెండింగ్ ఉన్నట్టు వ్యవసాయ శాఖ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 2000 నిధులు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటా 5000 విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు అర్హుల జాబితా వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
🔥టీటీడీ లో ఫుడ్ సేఫ్టీ ఉద్యోగాలు భర్తీ
Annadata Sukhibhava Important Updates:
- మొత్తం రైతులు 47.77 లక్షల మంది ఉన్నారు.
- జూలై నెలలో ఈ పథకం డబ్బులు జమ చేస్తారు.
- ఇప్పటివరకు 98% రైతులు ఈ కేవైసీ పూర్తి చేయడం జరిగింది.
- కౌలు రైతులకు కూడా ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తారు.
- ఈ పథకం ద్వారా రైతులకు మొదటి విడత ద్వారా 5000 ఆర్థిక సహాయం అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం.
- భూమిలేని కౌలు రైతులు కౌలు గుర్తింపు కార్డు ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
- ఇంకా ఎవరైనా భూమి ఉన్న రైతులు నమోదు చేసుకోకుండా ఉంటే వెంటనే నమోదు చేసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Annadata Sukhibhava Eligible List:
అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటుంది ఆన్లైన్ లో చూసుకోవాలంటే అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో త్వరలో అప్డేట్ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ కేవైసీ పేరు వచ్చిన రైతులు అందరూ అర్హులని భావించవచ్చు త్వరలో ఆన్లైన్ ద్వారా ఈ లిస్ట్ అందుబాటులో వస్తుంది వాట్సాప్ మన మిత్రులు కూడా అప్డేట్ చేస్తామని తెలియజేశారు. జూలై నెలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తారు.
ఇటువంటి అన్నదాత సుఖీభవ పథకాల సమాచారం రోజు పొందాలంటే మా వెబ్సైట్ సందర్శించండి.