Grama Sachivalayam Latest News:
గ్రామ వార్డు సచివాలయాలు ప్రక్షాళన చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది వీటికి సంబంధించిన Grama Sachivalayam Latest News రావడం జరిగింది.
గ్రామ వార్డు సచివాలయం ను ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోంది అలాగే రేషనలైజేషన్ చెయ్యనున్నారు ఎందుకు చేస్తోంది ఎలా చేస్తోంది పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Grama Sachivalayam Latest News Update:
గ్రామ వార్డు సచివాలయం లో ప్రస్తుతం 1.26 లక్షల ఉద్యోగులు పని చేస్తున్నారు అందరూ పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారు అన్ని ప్రభుత్వ అలవెన్సులు,పే స్కేల్ వీరికి లభిస్తోంది.ఇందులో ప్రస్తుతం వచ్చిన సమస్య ఏమిటి అంటే గ్రామాల్లో పదుల సంఖ్యలో ఉద్యోగులను నియమించడం వారికి జాబ్ చార్టు లేకపోవడం కొందరికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం మరికొందరికి అస్సలు పని లేకపోవడం ప్రధాన సమస్య.
ప్రక్షాళన ఎలా చేస్తారు:
గ్రామ సచివాలయం లో మొత్తం 11 నుండి 13 మంది ఉన్నారు వీరిలో ఏఎన్ఎం వీఆర్వో, సంక్షేమ కార్యదర్శి,మహిళా సంరక్షణ కార్యదర్శి,డిజిటల్ అసిస్టెంట్ ఈ 5 ఉద్యోగులను ఉంచి మిగిలిన వారికి వారి మాతృ శాఖ లేదా క్లస్టర్ విధానం లో మార్పు చెయ్యనున్నారు.
వార్డు సచివాలయంలో మొత్తం పదిమంది ఉద్యోగులు ఉన్నారు వీరిలో అడ్మిన్,ఎడ్యుకేషన్, సంక్షేమ కార్యదర్శి ,శానిటేషన్,ఏఎన్ఎం,మహిళా సంరక్షణ కార్యదర్శి ఈ ఉద్యోగులనుంచి మిగిలిన వారిని వారి మాతృ శాఖ లేదా క్లస్టర్ విధానంలో బదిలీ చేయనున్నారు.
క్లస్టర్ విధానం:
అసలు ఈ క్లస్టర్ విధానం అంటే ఏమిటి అనగా జనాభా ప్రాతిపదికన 5 వేల జనాభాకు ఒక క్లస్టర్ గా విభజించి అందులో కావాల్సిన మౌలిక సదుపాయాలు,మానవ వనరులను ఉపయోగించుకోవడం కోసం ఈ ఉద్యోగులను వినియోగించుకోనున్నారు.
HCL లో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
AP లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్
గ్రామ వార్డు సచివాలయాలకు అవసరమైన ఐదు ఆరుగురు కార్యదర్శులు అక్కడ నుంచి మిగిలిన వారిని ఆయా మాతృ సంస్థలకు పంపడం ద్వారా ఆయా శాఖలు బలోపేతం చేసినట్లు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. మినీ మున్సిపాలిటీలు, మినీ మండలాలుగా సేవలందించేలా ఈ సచివాలయాలలో తీర్చిదిద్దనున్నారు
వ్యవసాయ కార్యదర్శులు అప్డేట్:
గ్రామ సచివాలయం లో పని చేస్తున్న వ్యవసాయ కార్యదర్శులను వ్యవసాయ ఆఫీసర్ కిందకు తీసుకురానున్నారు ఇప్పటి వరకు వీరు పంచాయతీ కార్యదర్శి DDO గా ఉన్నారు మొదటి సరిగా వీరిని మాతృ శాఖ కు బదిలీ చేస్తున్నారు.
పంచాయతీ కార్యదర్శులు అప్డేట్:
ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులకు DDO అధికారం ఇస్తున్నారు వీరిని పంచాయతీ కార్యాలయంలో ఉంచి ఆ బాధ్యతలు మాత్రమే చూసుకోనున్నారు గ్రామ సచివాలయం లో వేరే ఒక కార్యదర్శికి DDO అధికారం ఇవ్వనున్నారు ఇప్పటి దాకా వచ్చిన Grama Sachivalayam Latest News ఇది.
కొత్త నోటిఫికేషన్ వస్తుందా..?
గ్రామ సచివాలయం లో 30 వేలు వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చెయ్యాలి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారా అని చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు ఇప్పట్లో ఈ నోటిఫికేషన్ విడుదల కాకపోవచ్చు జాబ్స్ క్యాలెండర్ జనవరి లో విడుదల అయ్యే అవకాశం ఉంది అప్పుడు ఏదయినా సమాచారం వస్తుందా మనం చూడాలి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ,పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు