NTR Bharosa Pensions:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా పెన్షన్ పొందాలి అనుకున్నవారికి శుభవార్త రావడం జరిగింది. స్పౌజ్ కేటగిరి వితంతువులకు పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండు నెలల ముందు ప్రభుత్వం 2023 డిసెంబర్ నుండి పెన్షన్ పొందుతూ భర్త చనిపోతే భార్యలకు పెన్షన్ దరఖాస్తులు చేసేందుకు అవకాశం కల్పించిన సంగతి మనకు తెలిసిందే ఇప్పుడు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకోవడం జరిగింది పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
🔥TTD లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
2019 నుండి 2023 నవంబర్ వరకు ఎవరైనా పెన్షన్ పొందుతూ భర్త చనిపోయిన వారు ఉంటే భార్యలకు స్పౌజ్ కేటగిరి క్రింద పెన్షన్ మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామ మరియు వార్డు సచివాల సిబ్బంది సర్వే నిర్వహించి అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేస్తారు వీటికి అర్హులైన వారు ఏం దరఖాస్తులు సమర్పించాలి. ఎలా దరఖాస్తు చేయాలి పూర్తి వివరాలు చూసుకుంటే.
AP NTR Bharosa Pensions Apply:
అర్హులైన వారి వివరాలు ఇప్పటికే గ్రామ మరియు వార్డు సచివాలయం సిబ్బంది వద్ద ఉంటాయి. ఒక వేళ వారు మిమ్మల్ని సంప్రదించకుంటే మీరే సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ ను సంప్రదించి దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేయడానికి 30 జూన్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. దరఖాస్తు చేసే సమయంలో క్రింద తెలిపిన పత్రాలు అన్ని సచివాలయం సిబ్బందికి సమర్పించాలి.
- భర్త మరణ ధ్రువీకరణ పత్రం
- రేషన్ కార్డు
- ఆధార్ కార్డు
- కుల ధ్రువీకరణ పత్రం
🔥నిరుద్యోగ భృతి గుడ్ న్యూస్ వచ్చింది
పైన తెలిపిన పత్రాలు అన్ని సిద్ధం చేసుకుని వారికి సమర్పిస్తే వారు ఆన్లైన్ లో నమోదు చేసి ప్రభుత్వం ఆమోదం చేసిన సమయంలో మీకు పెన్షన్ రావడం జరుగుతుంది. కొత్తగా 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి మరియు వికలాంగులకు దరఖాస్తు చేయడానికి ప్రభుత్వం ఇంకా అవకాశం ఇవ్వలేదు త్వరలో వీటికి సంబంధించిన వివరాలు దరఖాస్తు విధానం ఇచ్చే అవకాశం ఉంది.
ఇటువంటి AP NTR Bharosa Pensions సమాచారం రోజు పొందడానికి మా వెబ్ సైట్ సందర్శించండి లేదా పైన ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ లోకి జాయిన్ అవ్వండి.
1 thought on “NTR Bharosa Pensions: పెన్షన్ కొత్త దరఖాస్తులకు అవకాశం, వెంటనే వీరు తెలుసుకోండి”