Thalliki Vandanam Scheme:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా తల్లికి వందనం అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాల విద్యా శాఖ నుంచి తీసుకున్న పిల్లల వివరాలు డేటా లో గ్రామ మరియు వార్డు సచివాలయ శాఖ వద్దనున్న డేటా తో అనుసంధానం చేసి పరిశీలన చేయిస్తోంది. గతంలో గ్రామ మరియు వార్డు సచివాలయంలో నిర్వహించిన ఇంటింటి సర్వే డేటా ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయనున్నారు కావున ఈ సర్వేలో ఎవరైనా తల్లులు లేదా వారి పిల్లలు లేకుంటే వెంటనే గ్రామ సచివాలయం లేదా మీ వార్డు సచివాలయంలో రిజిస్టర్ చేసుకోండి. ఈ జాబితా ఆధారంగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి 15000 చొప్పున ఈనెల 14 లోపు తల్లుల ఖాతాలో జమ చెయ్యనున్నారు.
Thalliki Vandanam Scheme Status:
మీరు అర్హుల లేదా అనర్హుల అనే జాబితా త్వరలో గ్రామ మరియు వార్డు సచివాలయంలో అందుబాటులో రావడం జరుగుతుంది. అక్కడ వెళ్లి పరిశీలించుకోవచ్చు. ఈ డబ్బులు తల్లుల ఖాతాలో పడాలంటే ఏం చేయాలి అనే సమాచారం ఇప్పుడు చూద్దాం.
- తప్పనిసరిగా పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా లో ఉండాలి. ఒకవేళ లేకపోతే గ్రామ మరియు వార్డు సచివాలయంలో వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు.
- తల్లుల బ్యాంక్ ఖాతా NPCI లింక్ తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ లేకపోతే బ్యాంకుకు వెళ్లి మీ ఆధార్ కార్డు మరియు బ్యాంకు నంబర్ తో లింక్ చేసుకోవాలి.
- పిల్లలు అప్డేట్ Ekyc పూర్తిచేసుకుని ఉండాలి దీనికోసం గ్రామ మరియు వార్డు సచివాలయం సందర్శించండి.
పై వివరాలు అన్ని పరిశీలించుకున్న వారికి అన్ని సరిగ్గా ఉంటే డబ్బులు ఖాతాలో ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉంటే వారికి అన్నీ సరి చేసిన తర్వాత ప్రభుత్వం విడుదల చేస్తారు.
🔥డిగ్రీ అర్హత తో బంపర్ నోటిఫికేషన్ విడుదల
ఇటువంటి Thalliki Vandanam పథకాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి
3 thoughts on “Thalliki Vandanam: తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు ముఖ్యమైన అప్డేట్”