Annadata Sukhibhava News:
అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం జూన్ 20 న 5000 కేంద్ర ప్రభుత్వం 2000 జమ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ పథకంలో భాగంగా అందరూ రైతులు తప్పనిసరిగా ekyc చేసుకోవాలని నిబంధన ఉన్నది కావున అందరూ రైతు సేవా కేంద్రాలు వెళ్తున్నారు. ఇకనుండి ఇలా చేయవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు ఏమిటి రైతులు ఏమి చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటువంటి Annadata Sukhibhava పథకం సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైనున్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
Annadata Sukhibhava Ekyc:
అన్నదాత సుఖీభవ పథకం అర్హులకు ప్రభుత్వం పెద్ద శుభవార్త చెప్పడం జరిగింది అర్హులు అంతా ekyc కోసం రైతు సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అర్హులైన 45.65 లక్షల మంది రైతుల్లో 44.19 లక్షల మంది వివరాలు ఆటో అప్డేట్ చేసినట్లు వెల్లడించారు. సరైన వివరాలు లేని 1.45 లక్షల మంది మాత్రమే వేలిముద్ర వేస్తే సరిపోతుందని ఆ రైతుల వివరాలను రైతు సేవా కేంద్రాలకు పంపినట్లు తెలియజేసింది మీరు జూన్ 20 వ తేదీ లోపు దీనిని పూర్తి చేసుకుంటే డబ్బులు వారికి కూడా జమ చేస్తారు.
Annadata Sukhibhava Eligible List:
ఆంధ్రప్రదేశ్ అన్నదాత సుఖీభవ వెబ్సైట్ ద్వారా కూడా మీ వివరాలు తెలుసుకోవచ్చు ముందుగా మీరు https://annadathasukhibhava.ap.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులో Know Your Status ఆప్షన్ ద్వారా మీరు లబ్ధిదారుల కాదా తెలుసుకోవచ్చు. పైన తెలిపిన విధంగా అర్హులు అయినవారికి ₹7,000 జూన్ 20 వ తేదీ ప్రభుత్వం విడుదల చేస్తుంది మీకు ఆన్లైన్ ద్వారా చూసుకోవడం రాకపోతే రైతు సేవా కేంద్రం వెళ్లి మీరు Annadata Sukhibhava లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో పరిశీలించవచ్చు.
ఇటువంటి అన్నదాత సుఖీభవ పథకాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.