Andhra Pradesh మహిళలకు శుభవార్త: పిల్లల చదువుకు లక్ష రూపాయలు ఇచ్చే పథకం
Andhra Pradesh Dwcra New Scheme:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. పిల్లల చదువు కోసం కొత్త పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా పదివేల నుండి లక్ష రూపాయల వరకు అతి తక్కువ వడ్డీ 4 శాతం తో రుణం ఇచ్చే కొత్త పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం పేరు “ఎన్టీఆర్ విద్యా సంకల్పం” ఈ రుణం ఎలా ఇస్తారు ఎవరికి ఇస్తారు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
🔥పిల్లలకు షైనింగ్ స్టార్ అవార్డ్స్ 20 వేలు
పథకం పూర్తి వివరాలు:
ఈ పథకం పేరు ఎన్టీఆర్ విద్యా సంకల్పం ఇది డ్వాక్రా సంఘాల్లో ఉండే మహిళలకు ఇస్తారు కేవలం పిల్లల చదువు కొరకు పదివేల నుండి ఒక లక్ష రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు రుణం నాలుగు శాతం వడ్డీ తో ఉంటుంది. 36 నెలల వాయిదాలలో తిరిగి చెల్లించాలి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో, కళాశాలలు చదివే విద్యార్థుల తల్లి అర్హులు. ఈ రుణం ద్వారా స్కూలు మరియు కాలేజీ ఫీజులు చెల్లించవచ్చు విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులు కల్పించడానికి తల్లికి ఆర్థిక స్వేచ్ఛ అందించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు ఇప్పటికే తల్లికి వందనం అమలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఆ పథకంలో భాగంగా జూన్ 12న డబ్బు తల్లుల ఖాతాలోకి ఎంతమంది పిల్లలు ఉండే అంతమందికి చెల్లిస్తారు.
🔥ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఎలా దరఖాస్తు చేయాలి:
- దరఖాస్తు చేయడానికి మీరు తప్పనిసరిగా డ్వాక్రా సంఘంలో ఉండాలి.
- అప్లికేషన్ ఫారం సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ లేదా CO లేదా RP వద్ద మీరు పొందవచ్చు.
- అర్హత పరిశీలించి మీకు రుణం మంజూరు చేస్తారు.
- సమంత అధికారుల పర్యవేక్షణలో రుణం విడుదల చేస్తారు.
కావాల్సిన డాక్యుమెంట్స్:
ఈ పథకానికి మీరు దరఖాస్తు చేయడానికి క్రింద తెలిపిన పత్రాలు అన్ని సమర్పించాలి.
- తల్లి మరియు విద్యార్థి ఆధార్ కార్డు
- విద్యార్థి ఫోటో
- ఫీజు వివరాలు
- స్కూల్ స్టడీ సర్టిఫికెట్
- బ్యాంక్ ఖాతా వివరాలు
పై వివరాలు అన్ని చూసి Andhra Pradesh లోని డ్వాక్రా సంఘాల్లో ఉన్న తల్లులు ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకానికి దరఖాస్తు చేయండి ఏదైనా సందేహాలు ఉంటే డ్వాక్రా సంఘం లీడర్ లేదా CO లేదా RP ను అడిగి తెలుసుకోవచ్చు.
ఇటువంటి Andhra Pradesh కొత్త పథకాల సమాచారం రోజు పొందాలంటే తరచూ మా వెబ్సైట్ చూడండి లేదా పైన ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
1 thought on “Andhra Pradesh మహిళలకు శుభవార్త: పిల్లల చదువుకు లక్ష రూపాయలు ఇచ్చే పథకం”